విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీకాళహస్తి దేవాలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళాకేంద్రం గురువు మానస వారి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యం అందరిని ఆకట్టుకుంది. గురువు మానసతో పాటు శిష్య బృందం లిసికా సాయి దుర్గ, రోహిణి, తనుశ్రీ,, అన్విత, మౌణ్యశ్రీ వారు ప్రదర్శించిన నృత్యం అందరినీ అలరారించింది. అనంతరం దేవాలయ కమిటీ వారు గురువు మానసతోపాటు శిష్య బృందమును ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రత్యేక నృత్య ప్రదర్శన చూసిన ప్రేక్షకులు చెప్పట్లతో తమ సంతోషాన్ని చూపించారు. అనంతరం శ్రీకాళహస్తి దేవాలయ కమిటీ వారు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మానస నృత్య ప్రదర్శన తన శిష్య బృందంతో చేసినటువంటి వైనం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. గురువు మానస మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలలో మాకు అవకాశం ఇచ్చిన దేవాలయం కమిటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.