విశాలాంధ్ర ధర్మవరం:: ఒప్పందా అధ్యాపకులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని జేఏసీ నాయకులు పెద్దన్న, భాస్కర్ రెడ్డి, అక్బర్ బాషా, శంకర్ నాయక్, చంద్రకళ, సరిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేయడానికి ప్రభుత్వం ఐదు మంది మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని కమిటీ సిఫార్సు మేరకు ఒప్పంద అధ్యాపకులను రెగ్యులర్ చేయడానికి 114 జీవోతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి, శాసనసభలో యాక్ట ను తొలగించడం అన్యాయం అన్నారు. అర్హత కలిగిన అధ్యాపకులను యాక్ట్ 30 ప్రకారం 2000 సంవత్సరం నుండి 2012 వరకు అర్హత ఉన్న వాళ్ళందరినీ కూడా వెంటనే క్రమబద్ధీకరించి, ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.