బిజెపి నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:: ఎన్నికల నియమ నిబంధనలు పాటించేలా అధికారులు అందరూ కూడా యుద్ధ ప్రాతిపతకన చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక మునిసిపల్ కమిషనర్ రామ్ కుమార్ కు ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి కు వినతి పత్రాన్ని బిజెపి నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల నియమావళి అమలులో ఉన్నప్పటికీ వైయస్సార్ పార్టీకి సంబంధించిన గోడకు వేసిన స్టిక్కర్లు, ఇంటి గోడల మీద, విద్యుత్ స్తంభాల మీద తదితర ప్రాంతాలలో అలాగే ఇప్పటికీ ఉన్నాయని వారు తెలిపారు. వాటి మీద పెయింటింగ్ తో తొలగించాలని చాలాచోట్ల కూడా ఇండ్ల మీద, షాపుల మీద, వ్యక్తిగత హోల్డింగ్స్, ఇలా చాలాచోట్ల అలాగే ఉన్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు వీటి మీద దృష్టి సారించి తగిన న్యాయం చేయాలని వారు కోరారు.