విశాలాంధ్ర ధర్మవరం:; గర్భవతులు అందరూ కూడా తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు వైద్యుల చేతుల మీదుగా తగిన చెకప్పులు, వైద్య చికిత్సలు చేసుకోవాలని సిడిపిఓ- లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా నగర్ సెక్టార్ పరిధిలోని శివాలయము నందు సూపర్వైజర్ అరుణమ్మ, కొత్తపేట యూ పి హెచ్ సి డాక్టర్ ప్రియాంక, యు పి హెచ్ సి హెల్త్ సూపర్వైజర్ మారుతి కుమార్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక సిడిపిఓ లక్ష్మీలు మాట్లాడుతూ గర్భవతులు బాలింతలు, పిల్లల తల్లులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెయ్యి రోజుల సంరక్షణ గూర్చి వారు వివరించారు. అదేవిధంగా పోషక ఆహారం గూర్చి వారికి తెలియజేశారు. గర్భిణీలు గర్భ సమయములో తీసుకోవలసిన జాగ్రత్తలు బాలింతలకు కావలసిన ఆహారం బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు తల్లి బిడ్డ తీసుకోవలసిన ఆహారం గురించి పాటించాల్సిన పరిస్థితి గురించి అలవాట్లు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు, సూపర్వైజర్ మారుతి కుమార్ పాల్గొన్నారు.