విశాలాంధ్ర -జామి భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షురాలిగా జామి కి చెందిన రాయవరపు ఆదిలక్ష్మిని పార్టీ అధిష్టానం నియమించింది. శుక్రవారం ఎస్ కోట నియోజకవర్గం లోని ఐదు మండలాలకు పార్టీ అధ్యక్షులు నియమించిన అధిష్టానం అందులో భాగంగా జామి మండలానికి కూడా నియమించింది. గత కొంతకాలంగా ఆదిలక్ష్మి బీజేపీ పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు. కొప్పల వెలమ అధికంగా ప్రభావితమైన మండలంలో అదే కులానికి చెందిన ఆదిలక్ష్మిని నియమించడం పార్టీకి శుభసూచకమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆదిలక్ష్మి బిజెపి తరఫున ఉమ్మడి అభ్యర్థి కోళ్ల లలిత కుమారితో పార్టీ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆదిలక్ష్మిని నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.