విశాలాంధ్ర -ధర్మవరం : పేదలను ఆదుకోవడమే మా లక్ష్యము అని హజరత్ టిప్పు సుల్తాన్ కిద్మత్ టీం యొక్క ముఖ్య లక్ష్యము అని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా పిఆర్టి వీధిలోని మసీదులో ముస్లిం మైనారిటీ120 నిరుపేద కుటుంబాలకు రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకులను వారు పంపిణీ చేశారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ముస్లిం మైనారిటీ సోదరులకు కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అదేవిధంగా కరోనా టైములో ఆక్సిజన్ సిలిండర్లను పంపిణీ చేసి ఎన్నో ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు. నిరుపేద కుటుంబంలోని వారికి వివాహాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మెడికల్ కిట్టును, కుటుంబ పోషణకై ప్రతినెల ఆర్థిక సహాయము నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఆసక్తి గల దాతలు మా టీం వారిని సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూరు మంది టీం సభ్యులు పాల్గొన్నారు.