-ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంత బాబు
విశాలాంధ్ర-రాప్తాడు (ఆనంతపురం జిల్లా) : వచ్చే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులైన ఓటరు ఈనెల 15వ తేదీ లోపు ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వసంతబాబు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలోని అనంతపురం రూరల్, ఆత్మకూరు, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి, రామగిరి, కనగానపల్లి మండలాల పరిధిలోని అర్హత ఉన్న ఓటర్లు ఎవరైనా ఫారం-6, ఫారం-8 లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుదారుల అనుమతి లేకుండా ఇతరులు ఎవరైనా దరఖాస్తు చేసినట్లయితే చట్టరీత్యా చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయిస్తామన్నారు. ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆధార్ కార్డు, పదవ తరగతి మార్కుల జాబితా జతపరిచి పంపాలన్నారు. ఒకేసారి ఎక్కువ దరఖాస్తులు ఇస్తే తిరస్కరిస్తామన్నారు.