అధ్యక్షులు తల్లం నారాయణమూర్తి, కార్యదర్శి చిన్నప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవలను కొనసాగిస్తూ ప్రజల మన్ననలను పొందుతోంది. ఇందులో భాగంగానే మరో సేవకు మానవతా సంస్థ శ్రీకారం చుట్టిందని మానవతా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు తల్లం నారాయణమూర్తి, చిన్నప్ప, సహకార దర్శి మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి జననం మరణం తప్పదని, మరణించినప్పుడు బంధుమిత్రులు అందరూ కూడా ఆఖరి చూపుకు నోచుకోవడానికి ఒక అవకాశం ఇచ్చేందుకే తాము బాడీ ఫ్రీజర్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మావద్ద రెండు ఫ్రీజర్ బాక్సులు కలవని తెలిపారు. ఈ ఫ్రీజర్ బాక్స్ లను పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తామని తెలిపారు. కేవలం ఈ ఫ్రీజర్ బాక్స్ కావలసినవారు రవాణా సౌకర్యము వారే చూసుకోవలసినదిగా తెలిపారు. కావున పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు పాల్గొన్నారు.