ఎస్సై రాజారావు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ఒరిస్సా నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న 124 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేయడం జరిగిందని అన్నవరం ఎస్ఐ రాజారావు అన్నారు. సోమవారం ఆయన అందించిన వివరాలు ప్రకారం ఆపరేషన్ పరివర్తన లో భాగంగా జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాలతో, చింతపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ K. రమేష్ ఆధ్వర్యం లో మండలంలోని అన్నవరం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లోతుగెడ్డ వంతెన సమీపంలో రెండు ఆటోలతో తరలిస్తున్న 124 కేజీల గంజాయి పట్టుబడిందని, తమకు అందిన సమాచారం మేరకు, తమ సిబ్బందితో కలిసి లోతుగెడ్డ వంతెన సమీపంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, రెండు ఆటోల్లో ఆటోల అడుగు భాగంలో ప్రత్యేకంగా అమరిచ్చిన రహస్య భాగంలో గంజాయి అమర్చి అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న చింతపల్లి మండలానికి చెందిన కిల్లో కేశవరావు (రాళ్లగెడ్డ), సీందరి నాని (మేడూరు), పాలికి కొండబాబు (కప్పగొంది) అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరు ముగ్గురు గంజాయిని ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారని వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ముమ్మరంగా వాహన తనిఖీలు చేపడుతున్నామని, ఈ తనిఖీలాభంలో భాగంగా ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా గంజాయి గుట్టు బయటపడిందని ఆయన వివరించారు. ఎవరైనా నాటుసారా తయారీ, క్రయ విక్రయాలు, గంజాయి సాగు, రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగాఈ సందర్భంగా హెచ్చరించారు.