కళాశాల చైర్మన్ జి. చిన్నపరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఈనెల 30వ తేదీన విడుదల చేసిన ఏపీ ఐసెట్ -2024 ఫలితాల నందు శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల విద్యార్థుల అసమాన ప్రతిభ కనబరిచారని కళాశాల ఛైర్మన్ జి. చిన్నప్పరెడ్డి తెలిపారు. కళాశాల విద్యార్థినీ ఎస్. కావ్య 201 ర్యాంకును సాధించి, ధర్మవరంలో మొదటి స్థానం సాధించిందని తెలిపారు. అలాగే కళాశాల విద్యార్థులు భార్గవ 2147,శ్రీలేఖ 2900,మహమ్మద్ షాదిక్ 3200,జయచంద్ర 3800,సాయి 5100, త్రినాథ్ 8200 ర్యాంకును సాధించారని తెలిపారు. ఐసెట్ రాసిన విద్యార్థులలో 10 వేల లోపు ర్యాంకులను 18 మంది సాధించారని,ఈ సందర్భంగా చిన్నపరెడ్డి తో పాటు అధ్యాపకులు ప్రతిభ గణపతి ఇచ్చిన విద్యార్థులకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ రాఘవ రెడ్డి, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.