రాళ్లు, కుర్చీలతో దాడి
రోడ్డుపై పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం
వైసీపీ నేత పేర్ని నాని ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. గుంపుగా వచ్చిన కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కుర్చీలు విసురుతూ బీభత్సం సృష్టించారు. అక్కడే పార్క్ చేసిన కార్లపైనా ప్రతాపం చూపారు. పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని నిలువరించలేకపోయారు. పైపెచ్చు దాడి భయంతో ఓ పోలీసు పారిపోవడం కనిపించింది.