ఎంపీటీసీ సభ్యురాలు ధారలక్ష్మి, మత్స్యరాజు దంపతులు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్యవాసులంతా వైకాపా వెంటే ఉన్నారని మరో మారు రుజువయిందని ఆ పార్టీ చింతపల్లి ఎంపీటీసీ సభ్యురాలు దాసరి దారలక్ష్మి, మత్స్యరాజు దంపతులు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ రాష్ట్రమంతా ఎన్డీఏ కూటమికి అనుకూలంగా ఫలితాలు వెలువడినప్పటికీ అందుకు భిన్నంగా మన్యంలో ఫలితాలు వైకాపాకు అనుకూలంగా రావడం హర్సనీయమన్నారు. పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి వైకాపా అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా ఉంటూ చేసిన కృషి, వైకాపా ప్రభుత్వం అందించిన సంక్షేమం మరువని మన్యవాసులు వైకాపా వెంటే ఉండి అరకు పార్లమెంట్, అరకు, పాడేరు శాసనసభ స్థానాలలో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి వైకాపా అభ్యర్థులైన గుమ్మ తనుజా రాణి, రేగం మచ్చలింగం, మత్స్యరాస విశ్వేశ్వర రాజు లకు అఖండ విజయాన్ని అందించారన్నారు. ఈ సందర్భంగా సార్వత్రిక ఎన్నికలలో నూతనంగా ఎన్నికైన అరకు పార్లమెంట్ సభ్యురాలు తనూజ రాణి, పాడేరు శాసనసభ్యుడు మత్స్యరాస విశ్వేశ్వర రాజులకు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు.