విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని ఆదర్శ పాఠశాలలో 6వ తరగతి కోసం ప్రవేశ పరీక్ష రాసి 40 మార్కులు ఆపైన వచ్చిన విద్యార్థులు రేపటి నుండి ప్రిన్సిపాల్ ను గానీ ఉపాధ్యాయులను గానీ కలిసి సరైన సర్టిఫికెట్లతో రావాలని ప్రిన్సిపాల్ రంగన్న గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టీసీ, ప్రవేశ పరీక్ష హాల్ టికెట్, స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు జిరాక్స్ ప్రతులను తీసుకొని రావాలని కోరారు.