– రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు….
విశాలాంధ్ర – చోడవరం : తే.08.06.2024ది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో రైతాంగానికి విత్తనాలు, పురుగు మందులు సబ్సిడీ పై ఇవ్వాలి అని ఏ.పి. రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై రెడ్డిపల్లి శనివారం మీడియాతో మాట్లాడుతూ 90% సబ్సిడీపై విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ యంత్రాలు స్థానిక ఆర్బికే సెంటర్లో ఇవ్వాలని కోరారు.
2024 ఖరీఫ్ సీజన్ మొదలవుతున్న సందర్భంలో కొత్తగా కొలువు దేరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని విన్నవించారు. విత్తనాలు, పురుగు మందులు నకిలీల పై అధికారులు దృష్టి సారించాలన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అమ్మకాల్లో నకిలీలకు, అధిక ధరలకు పాల్పడే ప్రైవేట్ ఎరువులు దుకాణాల పై వ్యవసాయాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేసారు. నకిలీలతో రైతాంగం నష్టపోతారని, ఖరీఫ్ సీజన్ లో విత్తనాలు ఎరువులు అమ్మకాలకు ముందుగానే ప్రైవేట్ ఎరువులు, పురుగు మందులు దుకాణాలపై వ్యవసాయ అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి, నకిలీలు లేవని ధ్రువ పరచాలని కోరారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు రైతాంగానికి సబ్సిడీ ధరలతో అమ్మకాలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు.