ఇన్చార్జి సీఈవోగా బాధితులు స్వీకరిస్తున్న నరసింహులు
విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా): ఆస్పరి సింగిల్ విండో సొసైటీ ఇన్చార్జి సీఈవోగా నరసింహులు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో సీఈవో గా పని చేసిన అశోక్ నాయుడు రాజీనామా చేయడంతో ఆస్పరి సొసైటీ సీఈవో ఖాళీ ఏర్పడడం జరిగింది. అయితే ఈ సొసైటీలో సీనియర్ క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్న నరసింహులను ఇన్చార్జి సీఈవోగా నియమిస్తున్నట్లు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో బాధితులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇంచార్జి సీఈఓ నరసింహ మాట్లాడుతూ సహకార సొసైటీ ని అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ, రైతులకు ఎళ్ళవేళల అందుబాటులో ఉండి, రైతులకు రుణాలు, ఎరువులు సకాలంలో అందిస్తామన్నారు. రానున్న కాలంలో సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తూ జిల్లాలోనే ఆదర్శంగా నిలిసేలా కృషి చేస్తానని తెలిపారు.