ధర్మవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ వారి ఆవేదన
విశాలాంధ్ర -ధర్మవరం:: సార్వత్రిక ఎన్నికల్లో ధర్మవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున 56 రోజులు పాటు నిర్విరామంగా కష్టపడి ఎన్నికల విజయవంతం కావుటకు మా వంతు కృషి చేయడం జరిగిందని ధర్మవరం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ కమిటీ వారు తెలిపారు. అనంతరం వారు ఎన్నికలు మే 13 పూర్తి అయ్యిందని, అంతేకాకుండా జూన్ నాలుగవ తేదీన ఫలితాలు కూడా రావడం జరిగిందని, మరి మేము పని చేసిన డబ్బులు ఇవ్వడానికి అధికారులు నుండి స్పందన రాకపోవడం దారుణమన్నారు. మా విధులను పగలనకా, రాత్రనకా పనిచేయడం జరిగిందని, మా గోడును ఇదివరకే అధికారులకు తెలియజేసిన స్పందన లేకపోవడం మరింత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక తాసిల్దార్ రమేష్ కు తెలియజేసిన, ఫలితం లేదని, గత కొన్ని రోజులుగా తాసిల్దార్ కార్యాలయమునకు వెళుతున్న వారి జాడ కనపడలేదని మండిపడ్డారు. తాసిల్దార్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని బాధను వ్యక్తం చేశారు. కనీసం ఎప్పుడు ఇస్తారు అన్న విషయం కూడా అధికారులు తెలియపరచకపోవడం ఏమనుకోవాలో మాకే అర్థం కాలేదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల విధులకు మా టూవీలర్లకు తామే సొంత డబ్బుతో పెట్రోల్ వేసుకొని, విధులను విజయవంతంగా చేయడం జరిగిందని వాపోయారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు సార్వత్రిక ఎన్నికల్లో తాము పని చేసిన రోజులకు డబ్బులను సత్వరమే చెల్లించాలని వారు తెలిపారు. మరి ఈ సమస్యపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఓటర్లు తెలుపుతున్నారు.