విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని 28వ వార్డులో ఎల్-3 కు చెందిన బేల్దారు నాగరాజు అకస్మాత్తుగా మృతి చెందారు. సమాచారం అందుకున్న బిజెపి నాయకుడు డోల రాజారెడ్డి మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకొని పోగా, వారి ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి చేరుకొని ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇప్పటికే రాజారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా వారు సేవా కార్యక్రమాలను నిర్వర్తిస్తూ, ప్రజల వద్ద మంచి గుర్తింపు, మన్ననలు పొందారు.