కలెక్టర్కి గనిశెట్టి సత్యనారాయణ వినతి
విశాలాంధ్ర – పరవాడ (అనకాపల్లి జిల్లా); పరవాడ ఫార్మాసిటీలోని స్మైలెక్స్ లేబొరేటరీస్ కంపెనీలో ఇటీవల జరిగిన ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ కంపెనీలో వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం ఎలాంటి భద్రత చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. భద్రతా ప్రమాణాలను పూర్తిగా గాలికి వదిలేసిందన్నారు. గతంలోనూ ఈ పరిశ్రమలో పెదగంట్యాడ మండలం మురుబాయి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడని, అలాగే మరోప్రమాదంలో అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడని, ఇటీవల జరిగిన ప్రమాదంలో ఒడిస్సా రాష్ట్రానికి చెందిన కబీరాజ్ సాహో మృతి చెందాడన్నాడన్నారు. ఈ ప్రమాదాలన్నీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే జరిగాయని గనిశెట్టి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వలస కార్మికుల చట్టం, కనీస వేతనాల చట్టం అమలు చేయడం లేదని, ఈఎస్ఐ, పిఎఫ్ సదుపాయం కల్పించడం లేదని వివరించారు. ఈ నెల 23న ప్రమాదంలో మృతి చెందిన కబీరాజ్సాహు కుటుంబానికి అసలు నష్ట పరిహారం చెల్లించారా లేదా, ఒక వేళ చెల్లిస్తే ఎంత చెల్లించారో వెల్లడిరచకపోవడం దుర్మార్గం అన్నారు. వలస కార్మికుల్ని ఈ కంపెనీ యాజమాన్యం అత్యంత చులకనగా చూస్తోందని ఆవేధన వ్యక్తం చేసారు. చనిపోయిన కార్మికులకు తగిన నష్టపరిహారం చెల్లించడం లేదని గనిశెట్టి తన పర్యిదులో పేర్కొన్నారు. స్మలెక్స్ కంపెనీలో భద్రత ఆడిట్ నిర్వహించాలని, యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గనిశెట్టి కోరారు.