వాలంటీర్ వ్యవస్థను మించి ఒకట్రెండు రోజుల్లోనే శత శాతం పెన్షన్లు అందిస్తున్న ప్రభుత్వం తెదేపా
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వాలంటీర్ వ్యవస్థను మించి ఒకటి రెండు రోజులలోనే శత శాతం పెన్షన్లు పంపిణీ చేసే ప్రభుత్వం తెదేపా అని గత నెలలో పెన్షన్లు పంపిణీ చేసి నిరూపించిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్రరావు అన్నారు. ఎన్డీఏ కూటమి పార్టీలకు చెందిన నాయకులతో కలిసి బుధవారం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని పెన్షన్లు పంపిణీ చేసేదని, వాలంటీర్ వ్యవస్థ లేకపోతే పెన్షన్ల పంపిణీ సాధ్యం కాదని చేసిన ప్రచారాన్ని తిప్పి కొట్టి ఆ వ్యవస్థ లేకుండానే తెదేపా ప్రభుత్వంలో ఒకటి రెండు రోజుల్లోనే శత శాతం పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దన్నారు. చింతపల్లి మండలం రేపు జరగబోయే ఒకటో తారీకు పెన్షన్స్ లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి నాయకులు కార్యకర్తలు సచివాలయం సిబ్బందితో కలిసి గత నెలలో జరిగినటువంటి పెన్షన్లు యధావిధిగా సక్రమంగా ఒక రోజులో పూర్తి చేయాలని తెదేపా మండల అధ్యక్షుడు కిలో పూర్ణచంద్ర రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంటు బిసి సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం గ్రామ కమిటీ అధ్యక్షుడు రీమల ఆనంద్ ఎస్ కే కాసిం వల్లి, అర్జున్, సోమేశ్, జనసేన మండల ఉపాధ్యక్షుడు కిముడు కృష్ణమూర్తి కూటమి సభ్యులు పాల్గొన్నారు.