పాడేరు సబ్ కలెక్టర్ దాత్రి రెడ్డికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరాటే మాస్టర్ పాండురాజు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పాడేరు సబ్ కలెక్టర్ గా దాత్రి రెడ్డి, చింతపల్లి ఏఎస్పీగా ప్రతాప్ శివ కిషోర్ దంపతులు ఐఏఎస్, ఐపీఎస్ లుగా మన్య ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు అల్లూరి జిల్లాలో పనిచేయడం అభినందనీయమని స్థానిక కోఫో కాన్ కరాటే క్లబ్ ఇన్స్ట్రక్టర్ బాకూరు పాండురాజు అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి బొకే (పుష్పగుచ్చం) అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దంపతులైన దాత్రి రెడ్డి, ప్రతాప్ శివ కిషోర్ లు అటు ఐఏఎస్ గా, ఇటు ఐపీఎస్ గా అల్లూరి జిల్లా ప్రజలకు సేవ చేస్తుండడం అభినందనీయమన్నారు. వారిద్దరి సేవలను మన్యప్రాంత ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.