తెదేపా బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోవిందరావు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- కోలాహలంగా ప్రారంభమైన కొత్త సంవత్సరం లో వెనుకబడిన తరగతులకు మేలు చేసేందుకు సమిష్టిగా కృషి చేద్దామని తెదేపా బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పోలుపర్తి గోవిందరావు అన్నారు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని చింతపల్లికి చెందిన తెదేపా అరకు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు లక్కోజు నాగభూషణం గోవిందరావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ 2024 సంవత్సరంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తుందని మరో వంద రోజులలో అందరికీ మంచి రోజులు వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.