వైకాపా పాడేరు నియోజకవర్గ సమన్వయకర్త విశ్వేశ్వర రాజు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా):- అనేక సంక్షేమ పథకాలను మహిళల పేరిట అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి గా ఆయననే గెలిపించుకుందామని వైకాపా పాడేరు నియోజకవర్గం సమన్వయకర్త మత్స్యరాస విశ్వేశ్వర రాజు అన్నారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వివిధ గ్రామాల ప్రజల ఆహ్వానం మేరకు ఆయన పలు శివాలయాలను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ముందుగా మండలంలోని అంతర్ల గ్రామంలో సోమలింగేశ్వర స్వామి, కొత్త పాలెం పంచాయితీ కిన్నెర్ల గ్రామంలో కోటి లింగాల ఆలయాలను ఆయన దర్శించుకున్నారు. అనంతరం కిన్నెర్ల సచివాలయం 2 పెద్ద వీధి గ్రామంలో గ్రామస్తులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను మహిళలకు వివరిస్తూ రాష్ట్రంలో ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఏకైక ప్రభుత్వం వైకాపా అని, ఎన్నో పథకాలతో మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్న జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన ప్రయత్నించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటీసీ పోతురాజు బాలయ్య, సీనియర్ నాయకులు జల్లి సుధాకర్, మాజీ వైస్ ఎంపీపీ బూసరి కృష్ణారావు, మాజీ సర్పంచ్ కిట్లంగి రాంబాబు, గ్రామ పెద్ద కవడం కొత్తన్న దొర, కె సోమరాజు, మండల ప్రచార అధ్యక్షులు రాంబాబు, సచివాలయం కన్వీనర్ కిట్లంగి క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు,_