చౌడుపల్లి సర్పంచ్ లలిత ఎంపీటీసీ మీనా కుమారి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- తాము వైకాపా పార్టీకి విధేయులం తప్ప వ్యక్తులకు కాదని చౌడుపల్లి సర్పంచ్ గెమ్మేల లలిత, ఎంపీటీసీ సభ్యురాలు లువ్వాబు మీనా కుమారి లు అన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ వైకాపాలో పదవులు అనుభవించి స్వప్రయోజనాల కోసం పార్టీలు మారే వ్యక్తులు చేసే ఆరోపణలలో వాస్తవం లేదన్నారు. ఈనెల 10న చింతపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో వైకాపాకు చెందిన ట్రైకార్ చైర్మన్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అన్నారు. ఈ నేపద్యంలో నియోజకవర్గానికి చెందిన మరి కొంతమంది త్వరలోనే తన బాటలోనే పయనిస్తారని జరుగుతున్న ప్రచారం వాస్తవ విరుద్ధం అన్నారు. చింతపల్లి మండలం నుంచి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అంతా పార్టీకి విధేయులుగా ఉన్నారన్నారు. ముఖ్యంగా తాము వైకాపా నుంచి దూరం అయ్యే ఆలోచనలో లేమన్నారు. పార్టీ నిర్ణయమే తమకు శిరోదార్యమన్నారు. వైకాపా నుంచి ఎవరిని అభ్యర్థులుగా ప్రకటించినా వారి వెంట పనిచేసేందుకు, వారిని గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తమకు పార్టీ ముఖ్యం తప్ప వ్యక్తులు కాదని వారు పునరుద్ధరించారు.