పార్టీలకతీతంగా ప్రజా సమస్యలపై పోరాడే పత్రిక విశాలాంధ్ర
పాడేరు శాసనసభ్యురాలు భాగ్యలక్ష్మి
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- పార్టీలకతీతంగా ఎల్లవేళలా ప్రజా సమస్యలపై అలుపెరుగని ఉద్యమాలు చేస్తూ ప్రజల పక్షాన నిలిచే పత్రిక విశాలాంధ్ర అని వైకాపా అరకు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త, పాడేరు శాసనసభ్యురాలు కొట్టగుళ్ళి. భాగ్యలక్ష్మి అన్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం సంబంధించి విశాలాంధ్ర 2024 క్యాలెండర్ ను స్థానిక పాత్రికేయుడు షేక్ కాశిం వల్లి ఆధ్వర్యంలో చింతపల్లి, జికే వీధి ఎంపీపీలు కోరాబు అనూష దేవి, బోయిన కుమారి, జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, పలువురు సర్పంచ్ లు, ఎంపీటీసీలతో కలసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1952లో స్థాపించిన విశాలాంధ్ర దినపత్రిక దినదిన ప్రవర్ధమానమై నేటికీ ప్రజల పక్షాన పోరాడుతుందన్నారు. ప్రజా సమస్యలను వెలికి తీసి ఆ సమస్యల పరిష్కారంలో తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్రాలలో ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా, ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా విశాలాంధ్ర దినపత్రిక చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దినపత్రిక లో కథనాలతో పాటు, ప్రతి ఏడాది ఆకర్షణీయవంతంగా విడుదల చేస్తున్న విశాలాంధ్ర క్యాలెండర్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుందన్నారు. ఇటువంటి ప్రజలు మెచ్చిన పత్రికలో వస్తున్న కథనాలు, ప్రతి ఏటా క్యాలెండర్ లు రూపొందిస్తున్న విశాలాంధ్ర యాజమాన్యానికి, ఆ పత్రికలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు మోరి రవి, కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి, తాజంగి సర్పంచ్ మహేశ్వరి, స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు చెందాడ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.