ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె.రాజా రెడ్డి
విశాలాంధ్ర – ఆత్మకూరు : ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి జె రాజారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆత్మకూరులో ఆటో డ్రైవర్ల ఈ సమావేశానికి ముఖ్య ఆహ్వానితులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి,ఉప ప్రధాన కార్యదర్శి మల్లికార్జున, ఆటో యూనియన్ కార్యదర్శి రాజు, సిపిఐ మండల కార్యదర్శి సనప నీళ్లపాల రామకృష్ణ హాజరైనారు.
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ… ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రవాణా రంగం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 50% డ్రైవర్ల కోసం కేటాయించాలన్నారు.
ఫైన్స్ ను పెంచుతూ విడుదల చేసిన 894 గెజిట్ను, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 21 ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, యూనిఫామ్స్ ధరించాలని, ప్రజలతో సఖ్యతగా మెలగాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి సురేష్, ఆత్మకూరు ఆటో యూనియన్ నాయకులు చంటి, గొరిదిండ్ల హనుమన్న, హీరోలప్ప, శంకర్ రెడ్డి, నరేంద్ర, రాము, హనుమన్న, దాదు తదితరులు పాల్గొన్నారు.