యునైటెడ్ పాస్టర్స్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పాస్టర్ షేక్
విశాలాంధ్ర – ధర్మవరం:: మణిపూర్ లో దాడి చేసిన నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయం చేయాలని మంగళవారం ఆర్డిఓ తిప్పే నాయక్కు యునైటెడ్ పాస్టర్ వెల్ఫేర్ సర్వీస్ సొసైటీ అధ్యక్షులు పాస్టర్ షేక్, కార్యదర్శి పాస్టర్ సుధాకర్ రెడ్డి లు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటన అతి దారుణమని, బాధాకరమని తెలిపారు. అందుకే తాము ఇటీవల శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. మున్ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి పాస్టర్. సొలోమోను, కోశాధికారి గ్రేసయ్య కమిటీ సలహాదారులు శామ్యూల్, సుందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.