విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : అనంతపురంలోని హౌసింగ్ బోర్డుకు చెందిన రామచంద్రుడు గురువారం హౌసింగ్ బోర్డు స్టేట్ బ్యాంకుకు వెళ్లి అకౌంట్లో కొంత డబ్బు జమచేశాడు.
అనంతరం స్థానిక డీ మార్ట్ సమీపంలోని వెంచర్ కు ద్విచక్ర వాహనంపై వెళ్లాడు.
మూడు తులాల బంగారు ఆభరణాలున్న బ్యాగును సదరు ద్విచక్ర వాహనానికి తగిలించికెళ్లాడు.
మార్గంమధ్యలో సదరు బ్యాగు కిందకు పడిపోయింది. ఇదేమి గమనించకుండా రామచంద్రుడు ఇంటికి వెళ్లాడు.అటుగా వెళ్తున్న పండ్ల వ్యాపారి మహమ్మద్ వలీకి (అజాద్ నగర్ ) ఆ బ్యాగు దొరికింది. సమీపంలో ఉన్న వారిని ఆరా తీశాడు. కానీ ఆ బ్యాగు ఎవరిదనేది తేలకపోవడంతో ఇంటికి తీసికెళ్లాడు.
అందులో పరిశీలించగా బంగారు చైన్, కమ్మలు (ముడు తులాలు) ఉన్సట్లు గుర్తించాడు. ఆ బ్యాగులో ఉన్న బ్యాంకు పాసుబుక్ ఆధారంగా రామచంద్రుడికి సంబంధించినదని కనుగొన్నారు.
అదే సమయంలో స్థానిక 4 వ పట్టణ పోలీసు స్టెషన్ ఎస్సై నాగమధును సంప్రదించి బాధితుణ్ణి రప్పించారు.అనంతపురం డీఎస్పీ జి. ప్రసాదరెడ్డి మహమ్మద్ వలీని అభినందించారు. సదరు బ్యాగును బాధితుడికి అందజేశారు.మహమ్మద్ వలీ నిజాయితీని మెచ్చుకుని రామచంద్రుడు ఔదార్యంగా రూ. 5 వేలు ఇచ్చాడు