విశాలాంధ్ర -ధర్మవరం: అణగారిన వర్గాల అభ్యున్నత కోసం కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఎమ్మార్పీఎస్ నాయకులు బూదెప్ప, రామాంజనేయులు, శివప్రసాద్, గంగాధర్, నారాయణ, జిఎన్.వి ప్రసాద్, పవన్, నితీష్, కామేష్,కామరాజు, అంజి తదిమర్రి రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి 38వ వర్ధంతి వేడుకల సందర్భంగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధానిగా ఉంటూ దేశానికి ఎనలేని సేవలు చేశాడని, భారత ప్రజలకు లభించిన అమూల్య రత్నం అని వారు కొనియాడారు. అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లను అమలుపరిచిన ఘనత వీరికే దక్కిందన్నారు. కార్మిక శాఖ మంత్రిగా, నెహ్రూ మంత్రివర్గంలో పనిచేస్తూ, ఉప ప్రధానిగా కూడా సేవలను కొనసాగించారని తెలిపారు. బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను సేవలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి దళితుడు ఎస్సీ , ఎస్టీ. ప్రజలందరూ రాజకీయంగా ఎదగాలని వారు కోరారు. అంతేకాకుండా బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనాలకు, వారి అడుగుజాడల్లో కూడా వెళ్లాలని తెలిపారు..