మున్సిపల్ చైర్ పర్సన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న
విశాలాంధ్ర ధర్మవరం::(శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో ఈనెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు పురపాలక సంఘ ప్రత్యేక బడ్జెట్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి అవసరము ఉన్నందున బడ్జెట్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కావున కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ నెంబర్లు, అన్ని విభాగాల అదుపతులు, మున్సిపల్ అధికారులు హాజరు కావాలని తెలిపారు. అదేవిధంగా 2023-24 సంవత్సరమునకు సవరించిన బడ్జెట్ అంచనాలు, 2024-25 సంవత్సరమునకు తయారు చేయబడిన బడ్జెట్ అంచనాలు ను కౌన్సిల్ ఆమోదం పొందవలసి ఉన్నదని వారు తెలిపారు. కావున అందరూ సకాలంలో విచ్చేసి సమావేశమును జయప్రదం చేయాలని తెలిపారు.