విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 27వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న శాదిక్ కుమారుడు మహమ్మద్ తోఫిక్ గత మూడు రోజుల క్రితం ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న 27వ వార్డు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంచార్జ్ డోలా రెడ్డి మంగళవారం వారి ఇంటికి వెళ్లి తన సంతాపం తెలుపుతూ తనవంతుగా 5000 రూపాయల ఆర్థిక సహాయాన్ని వారు అందజేశారు. ఈ సందర్భంగా డోలా రాజారెడ్డి మాట్లాడుతూ కుమారుని యొక్క మృతి ఆ కుటుంబానికి ఎంతో బాధను ఇస్తుందని, అనుకోని సంఘటన వలన ఇలాంటివి జరిగినప్పుడు ధైర్యంగా ఉండాలని తెలిపారు. మీ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటానని డోలా రాజారెడ్డి భరోసా ఇచ్చారు.