విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామంలో రూ.60 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు గురువారం వైఎస్ఆర్సిపి యువజన విభాగం జోనల్ చైర్మన్ వై. ప్రణయ రెడ్డి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పనకు సీఎం జగన్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. రాకెట్ల గ్రామంలో గడప గడప నిధులు రూ.20 లక్షలు, ఉపాధి హామీ నుండి 25 లక్షలు, మండల పరిషత్ నుంచి మరో రూ.15 లక్షలు మొత్తం 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివమ్మ, ఎపిపి చంద్రమ్మ, జెడ్పిటిసి పార్వతమ్మ, వైస్ ఎంపీపీ నరసింహులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు తిప్పయ్య కమ్మ, కురుబ కార్పొరేషన్ల డైరెక్టర్లు తేజోనాథ్, గోవిందు, పెన్నహోబిలం మాజీ చైర్మన్ అశోక్ కుమార్, దయ్యాలు నాగరాజు, రామిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.