పీపీ యూనిట్. మెడికల్ ఆఫీసర్ జగదీష్
విశాలాంధ్ర -ధర్మవరం:: నులిపురుగుల నివారణలో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారని పిపి యూనిట్ మెడికల్ ఆఫీసర్. జగదీష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం లో భాగంగా పట్టణంలోని లింగశక్తి పాలెం లో గల అంగన్వాడి సెంటర్లో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నాగరాజు చేతులమీదుగా ఆల్ బెండజోల్ టాబ్లెట్స్ ను పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ పిల్లలు ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోనే అలవాటుగా చేసుకోవాలన్నారు. ఆహారాన్ని తీసుకొనడానికి మునుపు తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుకోవాలని తెలిపారు. అలా చేయని యెడల అనారోగ్యానికి గురి అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఓ అసిస్టెంట్. అన్నా లక్ష్మీనారాయణ, ఏఎన్ఎం. వరలక్ష్మి, ఆశా వర్కర్ హైదర్బి ,అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడి పిల్లల తల్లులు పాల్గొన్నారు.