జనసేన మండల అధ్యక్షులు కె.పురుషోత్తం…
విశాలాంధ్ర-గుంతకల్లు : జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు జగనన్న కాలనీల సామాజిక పరిశీలన కార్యక్రమంలో బాగంగా జనసేన మండల అధ్యక్షులు కురువ పురుషోత్తం ఆధ్వర్యంలో శనివారం టిడ్కో ఇళ్లను పరిశీలించారు.ఈ సందర్భంగా కె. పురుషోత్తం మాట్లాడుతూ.. గత ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యలో భాగంగా టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తిగా గాలికి వదిలేశారు, జగనన్న ముఖ్యమంత్రి అవ్వంగానే ఒక్క రూపాయికే టిడ్కోఇల్లు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని హామీ ఏమైందని తక్షణం లబ్ధిదారులకు ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని ప్రశ్నించారు, ప్రధానంగా జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పన పేరిట వైసిపి ప్రభుత్వం రూ.89 వేల కోట్ల ఖర్చు చేయనున్నట్లు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేసిందన్నారు. ఇక్కడ చూస్తే ఎటువంటి మౌలిక వసతులు లేవని అన్నారు. ఆ కోట్లు ఎటు పోతున్నాయని ప్రశ్నించారు. ప్రతి జగనన్న కాలనీలో రోడ్లు, వీధి దీపాలు, పార్కులు, గ్రంథాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తామని రకరకాల కబుర్లు చెప్పి ప్రజల్ని మోసం చేస్తూనే ఉందన్నారు. మౌలిక వసతుల పేరిట ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం ప్రజా ఆగ్రహానికి గురికాకముందే పేదవాడి సొంతింటి కల నిజం చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బండి శేఖర్, చిరంజీవి, పాండు కుమార్ ,సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, కప్పట్రాళ్ల కోటేశ్వరరావు, మైనారిటీ నాయకులు దాదు,బుర్ర అఖిల్ , చికెన్ మధు, లారెన్స్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.