విశాలాంధ్ర – పెద్దకడబూరు : సమస్యలను పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పల్లవి, నరేష్ కుమార్ ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను గుర్తించారని తెలిపారు. వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం లబ్ధిదారులకు కుల, ఆదాయ, అడంగల్ తదితర ధృవీకరణ పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వీరేంద్ర గౌడ్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈఓఆర్డి జనార్ధన్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.