విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలోని జనశక్తి నగర్ సచివాలయంలో వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్యదర్శి వడ్డే లక్ష్మీనారాయణకు శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రదానం చేసింది. దశాబ్ది వచన కవిత్వం (2001- 2010)- పరిశీలన అంశంపై ఎస్కేయూ తెలుగు – తులనాత్మక సాహిత్య అధ్యయన శాఖ ప్రొఫెసర్ ఎన్ ఆర్ సదాశివరెడ్డి పర్యవేక్షణలో సిద్ధాంత గ్రంధాన్ని రూపొందించారు. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీ రాం నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, లక్ష్మి నారాయణ ఎస్కేయూ తెలుగు విభాగంలోనే ఎంఏ తెలుగు పూర్తి చేశారు. తాడిపత్రిలోని సర్ రామన్ తెలుగు పండిత శిక్షణ కళాశాలలో టిపిటి చేశారు. 14 జాతీయ, 5 అంతర్జాతీయ సదస్సులకు హాజరై పరిశోధన పత్రాలు సమర్పించారు. 6 వర్క్ షాప్ లలో పాల్గొన్నారు. వివిధ అంశాలపై రాసిన 12 పరిశోధన వ్యాసాలు ప్రముఖ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్కేయూ నుంచి డాక్టరేట్ పొందారు. ఈ సందర్భంగా ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మయ్య, పాఠ్య ప్రణాళిక అధ్యక్షులు . ప్రొఫెసర్ . బాల సుబ్రమణ్యం .డీన్ ప్రొఫెసర్ నరసింహన్ అభినందించారు.