Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ధర్మవరం చేనేతల జోలికి వస్తే ఊరుకోం

పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర – ధర్మవరం : ధర్మవరం చేనేతల జోలికి వస్తే ఊరుకోమని,పట్టుచీరలు అప్పుగా ఇచ్చి డబ్బు అడిగితే.. దాడి చేస్తారా?
ఇది చేనేత వ్యవస్థపై జరిగిన దాడి అని,దీని వెనుక ఎవరున్నా కఠినంగా శిక్షించాలి అని ధర్మవరం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్
విజయవాడ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం తెలుగుదేశం పార్టీ నాయకులకు అమెరికా నుంచి ఫోన్ చేసి, బాధితులు కు జరిగిన దాడిని గూర్చి అడిగి తెలుసుకున్నారు. విజయవాడలో వస్త్ర వ్యాపారి, వైసీపీ నేత, ఆల‌య సిల్క్స్ అధినేత అవినాష్ ధర్మవరం చేనేత వ్యాపారులపై చేసిన దాడి మీద దారుణమని, వ్యాపారులు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి,చీరలు విక్రయిస్తుంటారని.. ఈ క్రమంలో మీకు కేవలం నమ్మకం మీద.. లక్షల రూపాయలు విలువ చేసే చీరలు ఇస్తే.. ఇలా దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఇచ్చిన డబ్బు ఇవ్వమంటే.. అమాయకంగా దొరికారని.. దాడులు చేసి, భయభ్రాంతులకు గురి చేస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. దాడి చేసిన అవినాష్ వైసీపీ నేతగా చెబుతున్నారని.. ఆయన ఏ పార్టీ వాడైనా సరే కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పటికే ముడిసరకు ధరలు పెరిగిపోయి.. పవర్ లూమ్స్ వచ్చి చేనేత వ్యవస్థ దెబ్బతింటోందన్నారు. ఈ క్రమంలో నష్టాలు భరించి, లక్షలు పెట్టుబడి పెట్టి, చీరల వ్యాపారులు వ్యాపారాలు చేస్తున్నారన్నారు. నమ్మకంగా అప్పులు ఇచ్చిన వ్యాపారులపై ఇలా దాడులు చేసే సంస్కృతి గతంలో ఎప్పుడూ లేదన్నారు. ఎక్కడో షాపింగ్ మాల్స్ లో ఇలా వ్యాపారం చేసుకునే వారికి ఒక చీర తయారు కావాలంటే దాని వెనుక ఎంత మంది కష్టం ఉందో తెలుసా అని నిలదీశారు. అప్పుగా చీరలు ఇచ్చిన పాపానికి ఇంత ఘోరంగా అవమానిస్తారా.. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచకాలకు ఇది పరాకాష్ట అన్నారు. సదరు వైసీపీ నేత అవినాష్ ఇంకా చాలా మందికి అప్పు ఉన్నట్టు తెలుస్తోందని.. వారందరికీ డబ్బు తిరిగి ఇచ్చేలా చేయడమే కాకుండా అతని పై చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ బాధితుల పక్షాన పోరాడుతుందన్నారు. ధర్మవరంలో చేనేతలకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img