విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆత్మకూరు మండలం సింగంపల్లి తండాలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ పర్యటించారు. గురువారం సింగంపల్లి తండా గ్రామంలో ప్రజలు, అధికారులతో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కొత్తగా స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని, గ్రామంలో అదనంగా త్రాగునీటి సరఫరా, విద్యుత్ సరఫరా చేయాలని, గ్రామంలో మంజూరైన ఓహెచ్ఎస్ఆర్ ను గ్రౌండ్ చేసి త్వరగా ఏర్పాటు చేయాలని, నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ, హౌసింగ్, పాఠశాల, హాస్పిటల్, అంగన్వాడి కేంద్రం గురించి, ఇతర అన్ని పథకాలపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, తహసీల్దార్, ఎంపీడీవో, సర్పంచ్, ఎంపీటీసీ, మండల స్థాయి అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.