ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే నా లక్ష్యము అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని 52 పనులను వారు ప్రారంభించారు. తొలుత ఎమ్మెల్యే స్వగృహం నుండి బైక్ ర్యాలీతో నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, భారీ ఎత్తున బయలుదేరి వెళ్లారు. అనంతరం తొలుత గూడ్శెట్టి కొట్టాలలో భూమి పూజ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుమునకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి బొకే ఇచ్చి స్వాగతం పలికారు. మొత్తం 30చోట్ల 53 పనులను అనగా గూడ్స్ కొట్టాలా, శాంతినగర్, మున్సిపల్ ఆఫీస్ పక్కన, శారద నగర్, శివానగర్, తిక్క స్వామి నగర్, కేశవనగర్, గీతా నగర్, లింగిశెట్టి పాలెం, బడేసాబ్ వీధి, లోని కోట, నేసేపేట బ్రాహ్మణ వీధి, బోయ వీధి, మార్కెట్ వీధి, యాదవ వీధి, సిద్దయ్య గుట్ట, పార్థసారథి నగర్, ప్రియాంక నగర్, సుందరయ్య నగర్, దుర్గా నగర్, సత్యసాయి నగర్, రాజేంద్రనగర్ ,మారుతి నగర్, బాలాజీ నగర్, కొత్తపేట ఉషోదయ స్కూల్, తారకరామాపురం, రాంనగర్, తదితరచోట్ల సిమెంట్ రోడ్లు డ్రైనేజీ కొరకు భూమి పూజ తో పాటు శిలాఫలకాన్ని ఎమ్మెల్యేతో పాటు కౌన్సిలర్ల చేత కూడా ప్రారంభింపజేశారు. అన్నిచోట్ల కౌన్సిలర్లు గజమాలతో ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ నేడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నారని, ఇందులో భాగంగా ధర్మవరం నియోజకవర్గానికి కూడా అనేక రకాలుగా నిధులు ఇచ్చి, అభివృద్ధికి పాటుపడడం నిజంగా సంతోషదాయకమని, ఇందుకు తాను సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగిందన్నారు. ప్రజలు కూడా ఆనాటి అభివృద్ధి పనులు నేడు జరుగుతున్న అభివృద్ధి పనులను గమనిస్తున్నారని, దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. మొత్తం 53 పనులకు 10 కోట్ల 42 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు డ్రైనేజీ ఇతర పనులను చేపట్టడం జరుగుతుందని, ఈ పనులన్నీ కూడా రెండు నెలల లోపు పూర్తి చేయాలని కాంట్రాక్టులకు వారు తెలియజేశారు. ఈ పనులను ఆయా వార్డు కౌన్సిలర్లు అప్పుడప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. ధర్మవరంలో 26 వేల ఇళ్లకు తాను పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. భవిష్యత్తులో కూడా ధర్మవరాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని వారు హామీ ఇచ్చారు. సచివాలయ వ్యవస్థలో ప్రజలందరికీ న్యాయం జరుగుతోందని, ఆయా వార్డు ప్రజలు ఆయా కౌన్సిలర్లకు సమస్యలు తెలిపితే పరిష్కరించే దిశలో తాను పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, కాబోయే వైస్ చైర్మన్ వేముల జయరామిరెడ్డి, మాజీ వైస్ చైర్మన్లు చంద్రమోరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్, పేనుజురి నాగరాజు, గోరకాటి పురుషోత్తం రెడ్డి, కుండా చౌడయ్య, కేతా లోకేష్, నీలూరి వెంకటరాముడు, తీర్థాల స్వర్ణలత, తదితరులతోపాటు కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సత్యనారాయణ, డిఈ లు. వన్నూరప్ప, కృష్ణారావు, సుధారాణి, ఏఈలు ప్రతాప్, హరీష్, కళావతి, శిరీష, నాయకులు కేశవరెడ్డి, ఉడుముల రామచంద్ర, బాల్రెడ్డి, తీర్థాల రమణ, సుభాన్ భాష, కాంట్రాక్టర్లు కేశవరెడ్డి, రమేష్ బాబు, రామయ్య ,వలి, ఇనా యతుల్ల,తదితరులు పాల్గొన్నారు.