అధ్యాపకులలో ఆందోళన..
విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ: అనంతపురం పట్టణంలోని సునీతానగర్ లో ఉన్న అంగన్వాడి కేంద్రం 8ను విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. సెంటర్ లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం , పాలు ,గుడ్లు, బాలామృతం అందిస్తున్న వివరాలను పరిశీలించారు. అనంతరం అనంతపురం పట్టణంలో కేఎస్ఆర్ గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో డిఈఓ ఆఫీస్ ఎండిఎం ఎడి , గత ఇంచార్జ్ డిఇఓ వి.నాగరాజు ప్రోటోకాల్ నిబంధనలను అనుసరించకపోవడం పట్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుండి పదో తరగతి పరీక్షలు రాస్తున్న అంధ విద్యార్థులు 13 మంది (రాప్తాడు లో హై స్కూల్ ) లో పరీక్ష ఏ విధంగా రాస్తున్నారని తెలుసుకున్నారు . ఎంపీడీవో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులతో సమీక్షించారు. కమిషనర్ తో జిల్లా విద్యాశాఖ అధికారిణి బి.వరలక్ష్మి, ఐసీడీఎస్ పీడీ శ్రీదేవి పాల్గొన్నారు.
ఏ పాఠశాలకు కమిషనర్ వస్తారని భయాందోళన.
ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధ్యాపకులపై విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కొరడా జలపించడంతో.. అధ్యాపకుల్లోనూ భయాందోళన నెలకొన్నది. విద్య బోధన విధానం, రికార్డులను , పరీక్షల మూల్యాంకన , సమయపాలన మొదలైన వాటిపై కమిషనర్ ఏ పాఠశాలను సందర్శిస్తారు. ఎటువంటి ప్రశ్నలు కురిపిస్తారు.. వాటికి సమాధానాలు ఎలా చెప్పాలో ముందస్తుగా అధ్యాపకులు అన్వేషణ లో సన్నతగా ఉంటూ.. మా పాఠశాలలకు ఈరోజు రాలేదు మేము ఊపిరి పీల్చుకున్నాం అన్నట్టుగా అధ్యాపకులు అనుకున్నటం చర్చనీయ అంశంగా మారింది. నిబంధనలు అనుసరిస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు కానీ అధ్యాపకులలో కమిషనర్ అంటేనే ప్రభుత్వ నిబంధనలను నిక్కొచ్చుగా ప్రశ్నిస్తూ ఉండటం పట్ల అధ్యాపకులలో ఒకింత తమ తప్పిదాలను ఎక్కడ పసిగడతారో అని .. లోపాలను ప్రశ్నిస్తారు అన్న ఆందోళన నెలకొన్నది.