విశాలాంధ్ర- పెనుకొండ : ఉద్యమకవి గద్దర్ కు కవితా నీరాజనం పేరుతో మడకశిర లో ఈనెల 13న ఆదివారం రోజు జరుగుతున్న కవిసమ్మేళనానికి కవులు తమ పేర్లను నమోదు చేసుకోవలెనని శ్రీ సత్యసాయి జిల్లా రచయితల సంఘం,అధ్యక్షులు,జాబిలి చాంద్ బాషా,దళిత హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు హనుమంతు,ఉపాధ్యక్షులు,ఉమర్ ఫారూక్ ఖాన్ ప్రధాన కార్యదర్శి డా. శివన్న ఒక ప్రకటనలో తెలియజేసారు.పాల్గొను కవులు సంప్రదించవలసిన నంబర్లు:- ,6300762315, ం919989045318,9346943336,944-080-5955..ప్రముఖ విప్లవ వాగ్గేయకారుడు.ప్రజా ఉద్యమ నౌక ,ప్రజా కవి అయిన గద్దర్ మరియు ది సియాసత్ దినపత్రిక ఎడిటర్ జహీర్ అలీఖాన్ మరణానికి సంతాపకంగా కవితా నీరాజన కవిసమ్మేళనాన్ని నిర్వహిస్తున్నాము.ఈ సందర్భంగా గద్దర్ జీవితం,ప్రజా పోరాటం,సాంస్కృతిక ఉద్యమంపై కవితలు,పాటలు పాడేవారు సంప్రదించండి అని దళిత హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షులు ఎం.ఆర్ హనుమంతు తెలియజేసారు.