విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని స్థానిక కాలేజీ మైదానంలో బాస్కెట్బాల్ కోర్టు ఆవరణములో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డిటి) సహకారంతో, ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పెయిన్ దేశానికి చెందిన ఈగల బాస్కెట్బాల్ క్లబ్ కు సంబంధించిన బాస్కెట్బాల్ కోచులు మౌర్, ఒరియోల్, నటాలియా, ఫోల్ తదితర అంతర్జాతీయ స్థాయి కోచ్ లతో శనివారంతో శిక్షణ ముగిశాయని ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ ముగింపు కార్యక్రమానికి వన్ టౌన్ సీఐ. సుబ్రహ్మణ్యం ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం సిఐ. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్పెయిన్ దేశానికి చెందిన బాస్కెట్బాల్ శిక్షకులు ఈ శిక్షణ ఇవ్వడం నిజంగా గర్వకారణమని, హర్షనీయమని, అభినందనీయమని వారు తెలిపారు. ఇటువంటి అవకాశాన్ని బాస్కెట్బాల్ క్రీడా విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదగాలని తెలిపారు. అనంతరం స్పెయిన్ బృందం వారికి, సీఐ సుబ్రహ్మణ్యంను ధర్మాంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మేడాపురం రామిరెడ్డి తో పాటు, సేట్టిపి జయచంద్ర రెడ్డి, కార్యదర్శి వా యల్పాడు హిదాయత్తుల్ల ,కోచ్ సంజయ్ చేతుల మీదుగా శాల్వాలతో, పూలమాలలతో ఘన సన్మానం నిర్వహించారు. తదుపరి ఈ శిక్షణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా, అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ ట్రస్ట్ సభ్యులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.