సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్
విశాలాంధ్ర బ్యూరో – శ్రీ సత్యసాయి : మణిపూర్ లో జరుగుతున్నటువంటి హింసాత్మక ఘటనలు మహిళలను నగ్నంగా ఊరేగింపు తదితర సంఘటనలు దేశానికే సిగ్గుచేటని ఈ సంఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్లక్ష్యం మణిపూర్ రాష్ట్ర బిజెపి ప్రభుత్వ మతతత్వ కులతత్వ అంశాల పైన మంగళవారం పుట్టపర్తి గణేష్ సర్కిల్ నందు సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు మోడీ దిష్టిబొమ్మతో పాడే కట్టుకొని శవయాత్రగా గణేష్ సర్కిల్ కు చేరుకుని మోది దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమాయ్య యాదవ్ మాట్లాడుతూ మణిపూర్ లో బిజెపి పాలన వల్ల అశాంతి నెలకొందని రెండు కులాల మధ్య చిచ్చుపెట్టి వందలాదిమంది చావుకు కారణం అయ్యారని వేలాది మంది గాయాల పాలయి మహిళల పై అత్యాచారాలు నిర్వహిస్తున్న అక్కడ బిజెపి ప్రభుత్వం ఏ మాత్రం కూడా అనిచివేయకుండా నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అదే విధంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ సంఘటనకు బాధ్యత వహించి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రధానమంత్రి ప్రజల పట్ల స్పందించి తీరు బాధాకరమని పట్టపగలు ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేస్తే ప్రధాని లో ఏమాత్రం చలనం లేదని ఈ విధమైనటువంటి బిజెపి పాలనలో ప్రజలు విసు గి పోయారని బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎస్ ఎస్ సి ఎస్ టి బి మైనారిటీ క్రిస్టియన్స్ ప్రజల పైన అనేక దాడులకు బిజెపి ప్రభుత్వమే పురు గొలుపుతుందని దుయ్యబట్టారు.ఇప్పటికైనా మణిపూర్ లో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు మణిపూర్ సంఘటన నిందితులనుకు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి ఆంజనేయులు మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి జయలక్ష్మి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గంగాధర్, గిరిజన సమైక్య రాష్ట్ర నాయకులు రామాంజనేయులు, సిపిఐ పట్టణ కార్యదర్శి గౌస్,సహాయ కార్యదర్శి వెంకటనారాయణ, భాష,తిరుపాలు, లక్ష్మీదేవి, లక్ష్మీ చెన్నమ్మ, జయమ్మ, ఈశ్వరమ్మ, తదితర మహిళలు సిపిఐ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.