30 తులాల బంగారు ఆభరణాలు, 920 గ్రాముల వెండి వస్తువులు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు… గుంతకల్లు డీఎస్పీ యూ . నరసింగప్ప అద్వర్యంలో గుంతకల్లు I టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కె . రామసుబ్బయ్య పక్క సమాచారంతో శుక్రవారం తన సిబ్బందితో కలసి గుంతకల్లు రైల్వే స్టేషన్ ఎక్స్ సర్కిల్ బ్రిడ్జి వద్ద ఇతనిని అరెస్టు చేశారు. ఇతను కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కూలీ పనుల నుండీ వచ్చే సంపాదన ఇతనికి ఉన్న అలవాట్లకు ఏ మాత్రం సరిపోయేది కాదు. ఎలాగైన సులువుగా డబ్బు సంపాదించాలని భావించి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు మొదలు పెట్టాడు. రద్దీ ప్రాంతాలు ఇళ్ల ముందర వాహనాలను నకిలీ తాళాల సహాయంతో దొంగలించాడు. వీటన్నింటినీ విక్రయించి సొమ్ము చేసుకోవాలనుకుని భావించిన క్రమంలో పోలీసులకు చిక్కాడు. ఇతనిని అరెస్టు చేసిన గుంతకల్ I టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ కె.రామసుబ్బయ్య, ఆయన సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు బి ఎస్ వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్స్ వీరాoజినేయులు, కిషోర్ కుమార్, షఫీ ఉల్లా, రామ మూర్తిని జిల్లా ఎస్పీ శ్రీ కె .కె .ఎన్ అన్బురాజన్ అభినందించారు.
ఈ మీడియా సమావేశంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప, జిల్లా స్పెషల్ బ్రాంచి, ఉరవకొండ రూరల్, గుంతకల్లు ఒన్ టౌన్ సి.ఐ మరియు అనంతపురం ఒన్ టౌన్ సి.ఐ లు పి.జాకీర్ హుస్సేన్, ప్రవీణ్ కుమార్, రామసుబ్బయ్య, రెడ్డెప్ప, బెళుగుప్ప ఎస్సై శివ, తదితరులు పాల్గొన్నారు.