ఏడిఏ సత్యనారాయణ
విశాలాంధ్ర,ఎన్ పి కుంట: రానున్న ఖరీఫ్ సీజన్లో రైతులకు కొత్త వంగడాలను అందజేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంపై మండల వ్యవసాయ శాఖ అద్వర్యం లో మంగళవారం మండల వ్యవసాయ సలహా మండలి సమావేశమును వ్యవసాయ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఏడిఏ సమక్షంలో నిర్వహించారు. ఏ డి ఏ మాట్లాడుతూ
రాబోవు ఖరీఫ్ 2024 కు సంభందిoచి ప్రణాళిక, విత్తనాలు ఎరువులు ,పురుగుమందులు పలు అంశాలపై చర్చించారు.అదే విధంగా వేరుశనగ పంటలో కొత్త వంగడాలను రాబోవు ఖరీఫ్ 2024కి రైతులకు అందించాలని వివరించారు.అదే విధంగా ప్రభుత్వం రైతులకు సున్నా వడ్డీ,పంటనష్ట పరిహారం విడుదల చేయడం జరిగిందని వివరించారు.
రబిలో బోరు బావులు క్రింద వేరుశనగ సాగు చేసిన రైతులు నుంచి నాణ్యత కలిగిన కాయలను రైతు భరోసా కేంద్రం ద్వారా క్వింటాకు 6377-00 తో కొనుగోలు చేస్తామని చేస్తామని వివరించారు. విత్తన వేరుశనగకాయలు ఉన్న రైతులు రైతు భరోసా కేంద్రం లో సంప్రదించాలని వివరించారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి, వాటర్ షెడ్ చైర్మన్ బయ్యారెడ్డి ఏ డీ ఏ సత్య నారాయణ , మండల వ్యవసాయ అధికారి లోకేశ్వర్ రెడ్డి ఏఈఒ శిరీష ఆర్ బీకె సిబ్బంది , ఎంపిఈఒ లు పాల్గొన్నారు.