Friday, May 17, 2024
Friday, May 17, 2024

ఐఆర్‌ఆర్‌ కేసులోసీఐడీకి షాక్‌!

ఛార్జిషీట్‌ స్వీకరణకు ఏసీబీ కోర్టు తిరస్కృతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఐఆర్‌ఆర్‌ కేసులో సీఐడీకి షాక్‌ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ కేసులో సీఐడీ వేసిన ఛార్జిషీట్‌ను శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19 ప్రకారం అనుమతి లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, మాజీ మంత్రి నారాయణ, లింగమనేని రమేష్‌, లింగమనేని రాజశేఖర్‌, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సహా మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ గురువారం సీఐడీ ఛార్జ్‌షీటు దాఖలు చేసింది. సింగపూర్‌తో చంద్రబాబు ప్రభుత్వం చేసుకున్నది తప్పుడు ఒప్పందమని సీఐడీ తేల్చింది. గవర్నమెంట్‌ టు గవర్నమెంట్‌ ఒప్పందం అంటూ తప్పుదారి పట్టించినట్టు సీఐడీ తెలిపింది. అయితే జీ 2 జీ ఒప్పందమే జరగలేదని సీఐడీ నిర్ధారించింది. సింగపూర్‌తో చేసిన ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిలేదని సీఐడీ పేర్కొంది. చట్టవిరుద్ధంగా మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో సుర్బానా జురాంగ్‌కు డబ్బులు చెల్లింపులు జరిగినట్టు నిర్ధారణ చేసింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, సీడ్‌ క్యాపిటల్‌, మాస్టర్‌ ప్లాన్‌లు రూపొందించినట్టు సీఐడీ పేర్కొంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ని లింగమనేని భూములు, హెరిటేజ్‌ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా మార్చినట్టు సీఐడీ చార్జ్‌ షీట్‌లో వెల్లడిరచింది. 58 ఎకరాల భూములను బంధువుల పేరుతో మాజీ మంత్రి నారాయణ కొన్నారని, లింగమనేని 340 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకుకి మేలు చేసేలా అలైన్‌ మెంట్‌ మార్పులు చేసినట్లు తెలిపింది. లింగమనేని నుండి చంద్రబాబుకు ఇంటిని ఇచ్చినట్టు సీఐడీ పేర్కొంది. లింగమనేని ల్యాండ్‌ బ్యాంక్‌ పక్కనే హెరిటేజ్‌ 14 ఎకరాల భూములు కొన్నట్టు సీఐడీ పేర్కొంది. ఈభూములకు విలువ పెరిగేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ అలైన్‌ మెంట్‌ మార్చినట్టు సీఐడీ నిర్ధారించింది. శుక్రవారం ఈ కేసుపై జరిగిన విచారణలో సీఐడీ ఛార్జ్‌షీట్‌ను కోర్టు తిరస్కరించిం ది. చార్జిషీట్‌ వేయాలంటే సెక్షన్‌ 19 ప్రకారం అనుమతి తప్పనిసరి అని పేర్కొంది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img