మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ
విశాలాంధ్ర -భీమవరం టౌన్ : నేను ఉండి ఎమ్మెల్యేగా ప్రజా క్షేత్రంలోనే ఉంటానని, నన్ను నా నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారని, వారి కోరిక మేరకు ప్రజాక్షేత్రంలో నిలబడతానని ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు అన్నారు. బుధవారం భీమవరంలోని తన కార్యాలయంలో విలేకరి సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. తాను ఏ పార్టీలో చేరేది, లేదా ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేసేదో త్వరలోవెల్లడిస్తాను అన్నారు. తాను 20 సంవత్సరాలుగా శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నా నియోజకవర్గ ప్రజలకే కాకుండా, బయట ప్రజలకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానని ఆ సేవా భావంతోనే ప్రజలు నన్ను ఆనాడు టిడిపి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగిందన్నారు.అప్పటినుండి శివారు ప్రాంతమైన ఉండి నియోజకవర్గంను ఎంతో కష్టపడి నా శాయశక్తులా ఎంతో అభివృద్ధి చేశానన్నారు. ప్రజలకు అవసరమైన త్రాగునీరు అందించడానికి ,వ్యవసాయ భూములకు ,ఆక్వా చెరువులకు సాగు నీటిని అందించడానికి , నియోజవర్గానికి అవసరమైన విద్యుత్తును అందించడానికి ఎంతో కృషి చేశానన్నారు. అనేక సందర్భాల్లో ప్రజా సమస్యలపై పోరాడి దీక్షలు చేశానన్నారు. ఉండిని ఆక్వా జోన్ గా అభివృద్ధి చేశానన్నారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న నన్ను 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు నర్సాపురం పార్లమెంట్ కి పోటీ చేయమని అనగానే ఆయన మాట మీద గౌరవంతో పోటీ చేయడం జరిగిందన్నారు. దీనిలో స్వల్ప ఆదిత్య తోనే ఓడిపోవడం జరిగిందన్నారు. అయితే 2024లో నన్ను సంప్రదించకుండా చంద్రబాబు వేరే వాళ్ళకి ఇవ్వటం తగదన్నారు. ఏది ఏమైనప్పటికీ నా నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు మళ్లీ ప్రజాక్షేత్రంలో నిలబడతానని అది ఏ పార్టీ నుంచో రెండు రోజుల్లోవెల్లడిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి మాజీ ఏఎంసీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు పాల్గొన్నారు.