Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

నిధులు రాబట్టాలి

. విభజన హామీల అమలు కావాలి
. ప్రతీ క్షణం రాష్ట్రంకోసం పనిచేయండి
. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్‌ దిల్లీ డ్రామా అని వ్యాఖ్య

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధ్యమైనంత సహాయం రాబట్టేలా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈనెల 22 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. మంత్రుల నుంచి వివిధ శాఖలకు చెందిన సమాచారం తీసుకుని కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. అవసరాన్ని బట్టి రాష్ట్ర మంత్రులను వెంటబెట్టుకుని ఆయా శాఖలకు చెందిన కేంద్రమంత్రులను కలవాలని ఆదేశించారు. ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలి. ఇప్పటికే 5 హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ప్రతి మూడు నెలలకు ఒక సారి పనితీరుపై సమీక్షిస్తా. ఎన్ని నిధులు తెచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో మీ పనితీరును సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు. అమరావతి, పోలవరం, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలి. షెడ్యూల్‌ 9,10 లో ఉన్న ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయాలి. కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులు అన్నీ 2014 నుంచి 2019 వరకు వేగంగా పూర్తి అయ్యాయి. కానీ జగన్‌ అన్నింటినీ రివర్స్‌ చేశాడు. నాడు మంజూరు చేసిన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలి. అవసరం అయిన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలి. కడప ఉక్కు పైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉంది. విశాఖ స్టీల్‌ విషయంలో తప్పుడు ప్రచారాలకు చెక్‌ పెట్టాలి. ప్లాంట్‌ ను సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మైన్స్‌ ను కేటాయించే అంశాన్ని పరిశీలించాలి. రాజధాని అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు తేవాలి. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్‌ కు 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలి. ఈ ప్రాంతాల్లో పారిశ్రాయిక రాయితీలు కూడా సాధించాలి. విశాఖలో రైల్వే జోన్‌ కు అవసరం అయిన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియపూర్తి చేయాలి. నడికుడి కాళహస్తి రైల్వే లైన్‌ పనులు వేగవంతం చేయాలి. భూసేకరణ సమస్యను పరిష్కరించాలి. కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు భూ సేకరణ జరగలేదు. దీన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకువెళ్లాలి.ముఖ్యంగా జాతీయ రహదారులపై ఎంపీలు దృష్టి పెట్టాలి. అమరావతి` అనంతపురం, రాజధాని ఔటర్‌ రింగ్‌ రోడ్డ్‌ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ట్రైబల్‌ యూనివర్సిటీ కొత్త వలసలోనే ఏర్పాటవుతుంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలి. ప్రతి నిముషం, ప్రతి రోజూ ముఖ్యమే అనే విధంగా ఎంపీలు పనిచేయాలి. ఆ స్థాయిలో మీరు చొరవ చూపితే రాష్ట్రానికి అంత త్వరగా మంచి జరుగుతుందంటూ చంద్రబాబు మార్గనిర్దేశనం చేశారు.
జగనేం చేస్తారో ముఖ్యం కాదు
దిల్లీలో జగన్‌ ధర్నా చేయనున్నారన్న అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు రాగా, అతని పార్టీ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నట్లు తెల్సింది. జగన్‌ గురించి ఒక్క క్షణం ఆలోచించే సమయాన్ని కూడా రాష్ట్రాభివృద్ధి కోసమే వెచ్చించాలని, దిల్లీలో జగనేం చేస్తారో ముఖ్యం కాదని, మనమేం చేయాలనేదే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈనెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నందున, వాటిని తప్పించుకునేందుకే జగన్‌ దిల్లీ డ్రామాలు ఆడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇటీవల పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్లో జరిగిన విధ్వంసం, ఇసుక, మైనింగ్‌, విద్యుత్‌ శాఖల్లో జరిగిన దోపిడీపై విడుదల చేసిన శ్వేతపత్రాల్లోని వాస్తవాలను ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదన్నారు. ఆయన పెంచి పోషించిన గంజాయి, డ్రగ్స్‌ సంస్కృతి వల్లే అనర్థాలు జరుగుతున్నాయని, వినుకొండ హత్య కూడా గంజాయి వల్లే జరిగినట్లు వైసీపీ నేతలే ఒప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యకు కూడా జగన్‌ రాజకీయ రంగు వేస్తున్నాడు. పోలీసుల విచారణలో కూడా ఇదే విషయం స్పష్టం అయ్యింది.అయినా వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.
టీడీపీ అంటేనే బెస్ట్‌ లా అండ్‌ అర్డర్‌ అని అంతా భావిస్తారు. ఈ బ్రాండ్‌ ను దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా సహించేది లేదు. రాష్ట్రంలో ఏ రకమైన హింసను అనుమతించేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img