Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

రెండున్నరేళ్లలోరాజధాని అభివృద్ధి

. తొలి మాస్టర్‌ ప్లానే అమలు
. గతంలో రూ.48 వేల కోట్లతో టెండర్లు
. రూ.9 వేల కోట్ల చెల్లింపులు
. పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ

విశాలాంధ్రబ్యూరో`అమరావతి: అమరావతి రాజధాని అభివృద్ధి పనులను రానున్న రెండున్నరేళ్లలో పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖమంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. ఆదివారం ఉదయం ఆయన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని ప్రపంచంలోనే తొలి ఐదు అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దే లక్ష్యంతో అత్యుత్తమ డిజైన్‌ను రూపొందించి అమలు పర్చామన్నారు. అమరావతి రాజధానికి సంబంధించి అత్యుత్తమైన డిజైన్ను రూపొందించేందుకు సింగపూర్‌, చైనా, జపాన్‌, రష్యా, మలేషియా తదితర దేశాలను కూడా సందర్శించామని గుర్తుచేశారు. రాజధానిలో అధిక ప్రాంతం కవర్‌ అయ్యేలా మౌలిక వసతుల కల్పనతో పాటు మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణానికి తొలి దశలో పనులను చేపట్టేందుకు గతంలో రూ.48వేల కోట్లతో టెండర్లను పిలిచి పనులను ప్రారంభించి, దాదాపు రూ.9 వేల కోట్ల చెల్లింపులను చేశామని తెలిపారు. మంత్రులకు, కార్యదర్శులకు, అధికారులకు, ఉద్యోగుల నివాసానికి సంబంధించి భవనాల నిర్మాణం కూడా దాదాపు 90 శాతం పూర్తయినట్లు తెలిపారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో భాగంగా 2015 జనవరి 1 న ల్యాండ్‌ పూలింగ్‌ కు నోటిఫికేషన్‌ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 వ తేదీ అర్ధరాత్రికల్లా ఎలాంటి లిటిగేషన్‌ లేకుండా 34 వేల ఎకరాలను రైతులు ప్రభుత్వానికి అందజేశారన్నారు. అలాంటి రాజధాని అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వం ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి గతంలో ఎంతో అధ్యయనం చేసి మంచి అనుభవాన్ని సాధించామని, అదే దృష్టితో సీఎం చంద్రబాబు మళ్లీ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా బాధ్యతలు తనకు అప్పగించారన్నారు. నేటి నుంచి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ రానున్న పదిపహేను రోజుల్లో ఒక స్పష్టత వచ్చి, ఏ సమయంలోపు ఏది పూర్తి చేస్తామనే విషయాన్ని ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెబుతూ…రాజధాని అభివృద్ధి విషయంలో గతంలో రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌నే అమలు పరుస్తామని స్పష్టంచేశారు. అమరావతి అభివృద్ధి పనులను మూడు దశల్లో నిర్వహించేందుకు గతంలో ప్రణాళిక రూపొందించి అమలు చేశామని, అమరావతి రాజధాని అభివృద్దికి తొలిదశలో రూ.48 వేల కోట్లు అవుతాయని అంచనా వేశామన్నారు. ఈ తొలి దశ పనులతో సిటీ నిర్మాణ పనులు పూర్తి అవుతాయని, రెండో దశలో మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. తొలుత అమరావతి సచివాలయం రెండో బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఆయనకు కేటాయించిన ఛాంబరులో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఎంతో ఘనంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు చేపట్టారు. సతీసమేతంగా రాష్ట్ర సచివాలయానికి విచ్చేసిన ఆయనకు వేదపండితులు పూర్ణకుంభంతో, అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మీ, సీడీఎంఏ శ్రీధర్‌, సీఆర్‌డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌, అదనపు కమిషనర్‌ కట్టా సింహాచలం, విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, సీఆర్డీఏ చీఫ్‌ ఇంజనీర్లు ఎన్‌వీఆర్‌కే ప్రసాద్‌, సిహెచ్‌.ధనంజయ్‌ తదితరులతో పాటు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.
మూడు వారాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ
నిరుపేదలకు కోసం ఏర్పాటు చేయబోయే అన్నా క్వాంటీన్లను మూడు వారాల్లో పునరుద్ధరిస్తామని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడిరచారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా క్యాంటీన్ల పునరుద్దరణపై మున్సిపల్‌ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు తొలిసారిగా చేసిన ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ దస్త్రం ఉందన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 203 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినప్పటికీ, 184 క్యాంటీన్లను ప్రారంభించగా మిగిలిన 19 క్యాంటీన్లు నిర్మాణ దశలో ఉండిపోవడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ కేంద్రాల్లో ఆహ్లదకరమైన వాతావరణంలో నిరుపేదలకు కేవలం రూ.5 కే ఉదయం అల్పాహారం, రూ.5కే మధ్యాహ్న భోజనం, రూ.5 కే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్ల వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. వీటిని పునరుద్దరించేందుకు అవసరమైన మరమ్మతులు చేసేందుకు అంచనాలను రెండు మూడు రోజుల్లో అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గతంలో అన్నా క్యాంటీన్ల నిర్వహణ బాధ్యతను ఇస్కాన్‌ ఆధ్యాత్మిక సంస్థకు అప్పగించామని, మూడు పూట్లా ఆహారం అందజేసేందుకు రోజుకు రూ.73 చార్జి వేశామన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా రోజుకి కేవలం రూ.15 కే మూడు పూట్లా ఆహారం అందజేస్తూ మిగిలిన రూ.58లు రాయితీగా ప్రభుత్వమే భరించిందని చెప్పారు. రోజుకి 2.25 లక్షల మంది అన్నా క్యాంటీన్ల ద్వారా భోజనం చేసే వారని, తమ హయాంలో మొత్తం మీద 4,60,31,600 ప్లేట్ల భోజన్నాన్ని అన్నా క్యాంటీన్ల ద్వారా పంపిణీ చేశామన్నారు. తొలుత మున్సిపల్‌ ప్రాంతాల్లో…ఈ అన్నా క్యాంటీన్లు పెట్టామని, ఆ క్యాంటీన్లకు ప్రజల ఆధరణ ఎంతగానో ఉండటాన్ని గమనించిన చాలా మంది ఎమ్మెల్యేలు గ్రామీణ ప్రాంతాలోనూ అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా, గ్రామీణ ప్రాంతాలకు కూడా మరో 150 అన్నా క్యాంటీన్లను ముంజూరు చేశామని గుర్తుచేశారు. పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ పొందిన అన్నా క్యాంటీన్లన పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు ఆమోదంతో త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు నారాయణ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img