Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

వేళ్లూనుకున్న విచ్ఛిన్నకర భావజాలం

ప్రమాదంలో దేశం
మెఫీ సెమినార్‌లో పరకాల

విశాలాంధ్ర – హైదరాబాద్‌: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోయినంత మాత్రాన ప్రమాదం తొలగిపోబోదని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే భావజాలం బలంగా ఉన్నదని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ భావజాలం ఒక మత్తు లాంటిదని, దానిని 10-15 ఏళ్లలో సమాజం నుండి నిర్మూలించేంత వరకు పనిచేయకపోతే దేశం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. మన దేశం, సమాజం, ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక విలువలు, విద్యా బోధన అన్నీ సంక్షోభంలో ఉన్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎన్నడూ లేనంత నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం, పేదరికం దేశంలో పెరిగాయన్నారు. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌మీడియా ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌, ఇండియా(మెఫీ) అధ్వర్యంలో ‘సంక్షోభంలో భారత గణతంత్రం-విశ్లేషణ’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో పరకాల ప్రభాకర్‌ ప్రసంగించారు. మెఫీ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సదస్సులో మెఫీ మేనేజింగ్‌ ట్రస్టీ దేవులపల్లి అమర్‌, ట్రస్టీ ఆలపాటి సురేశ్‌, వై.నరేందర్‌ రెడ్డి, కె.విరాహత్‌ అలీ తొలుత పరకాలను సన్మానించారు. భారతదేశం ఎదుర్కొంటున్న రాజకీయ, సామాజిక సంక్షోభాలపై ఇటీవల ఆయన రచించిన ‘ద క్రూక్డ్‌ టింబర్‌ ఆఫ్‌ న్యూ ఇండియా’ అనే పుస్తకంలోని అంశాలను వివరించారు. కరోనాలో వలస కూలీల వెతలు, గంగానదిలో శవాలు తేలడం, రూపాయి విలువ దిగజారడం, మణిపూర్‌ మారణహోమం కొనసాగడం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుదల వంటి వార్తలను ప్రజలు రెండు రోజుల తరువాత మరిచిపోతున్నారని ఆయన అన్నారు. మీడియా పనికిరాని లక్ష వార్తలు ప్రచురించి అసలు వార్తను మరుగున పరుస్తున్నదని, తద్వారా దేశం మొద్దు బారే పరిస్థితికి చేరుకున్నదన్నారు. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు కౌగిలించుకున్న అంశాన్ని కూడా ప్రచారానికి వాడుకునే సంస్కృతి వచ్చిందని వాపోయారు. తనను ప్రతిపక్షాలు 91 సార్లు తిట్టాయనే నిర్ధిష్టమైన సమాచారం ప్రధాని వద్ద ఉన్నదని, కానీ కోవిడ్‌కు ఎంతమంది ప్రజలు, ప్రత్యేకించి వలస కూలీలు చనిపోయారనే సమాచారం లేదన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, మునుపెన్నడూ లేనంత మంది ఉపాధి హామీ పథకం కింద దరఖాస్తు చేసుకోవడమే ఇందుకు నిదర్శనమని పరకాల ప్రభాకర్‌ అన్నారు. 1990 నుండి మొట్టమొదటిసారిగా 75 మిలియన్ల మంది భారతీయులు పేదరికంలోకి వెళ్లారని, ప్రపంచ పేదరికంలో ఇది 60 శాతమని చెప్పారు. పౌష్ఠికాహార లోపం గల చిన్నారులలో ప్రపంచంలో ప్రతి వందమందిలో 25 మంది భారతీయులున్నారని వివరించారు. వ్యవసాయం నుండి నాలుగు కోట్ల మంది తప్పుకున్నారని వివరించారు. తొమ్మిదేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు 23 శాతం నుండి 19 శాతానికి తగ్గిపోయాయని, ఆర్థిక వ్యవస్థ పెద్ద సంక్షోభంలో ఉన్నదన్నారు.
భారత్‌ను ఒక మతానికి చెందిన దేశంగా మార్చడానికి, దానిని జనబాహుళ్యం చేత ఒప్పించడానికి పెద్ద ప్రయత్నం జరుగుతోందని పరకాల ప్రభాకర్‌ అన్నారు. పాఠ్యపుస్తకాలు, సాహిత్యం, సినిమాలు, పుస్తకాలు, టీవీలు, పత్రికల ద్వారా పెద్దఎత్తున ప్రచారంలో

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img