Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

వ్యర్థాల నుంచి సంపద సృష్టిద్దాం

వినియోగించే ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలి
ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వినియోగించుకోవడంలో శాస్త్రీయ విధానాలు పాటిస్తే వ్యర్థాల నుంచి కూడా సంపద సృష్టించవచ్చని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అలాగే ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో మేనేజ్మెంట్‌ (ఎస్‌.ఎల్‌.ఆర్‌.ఎం.) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ అధ్వర్యంలో ‘గార్బేజ్‌ టూ గోల్డ్‌’ పేరుతో కార్యాలయ సమీపంలో శనివారం ప్రదర్శన నిర్వహించారు. దీనిని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఎస్‌.ఎల్‌.ఆర్‌.ఎం. ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ సి.శ్రీనివాసన్‌, శాసనమండలి సభ్యులు పి.హరిప్రసాద్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్‌ పర్యావరణహితంగా వ్యర్థాల నిర్వహణకు చేపట్టాల్సిన విధానాలను తెలియజేశారు. చెట్ల నుంచి రాలే ఆకులను, కొమ్మలను, పొడి చెత్తను ఊడ్చిన తరవాత తగులపెట్టడం వల్ల వాతావరణం కలుషితం అవుతోందని… వాటిని కంపోస్టుగా మారిస్తే ఎరువుగా ఉపయోగపడుతుందని వివరించారు. అయితే ఈ విషయంలో స్థానిక సంస్థలు తగు చర్యలు చేపట్టాలన్నారు. అదే విధంగా స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్‌ ఇబ్రహీంపట్నం సమీపంలోని జూపూడిలో చేపట్టిన పారిశుధ్య కార్యక్రమాలు, అనంతరం అక్కడ చేపట్టిన మొక్కల పెంపకాన్ని వివరించారు. వ్యర్థాల నిర్వహణ ద్వారా వచ్చే వర్మీ కంపోస్ట్‌కు మార్కెట్లో డిమాండ్‌ ఉందని దీనిపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. భూమికి సేంద్రీయ పదార్థాలు, పోషకాలు జోడిరచడంలో వర్మీ కాస్ట్‌ పాత్ర కీలకమని ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని, దీనికి రీ సైకిల్‌ కాని వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించకుండా చర్యలు తీసుకోవల్సి ఉంటుందని తెలియజేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ స్థానిక సంస్థలకు వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ ఒక సవాల్‌ గా మారుతోందని, శాస్త్రీయ దృక్పథంతో ఘన, ద్రవ వ్యర్థాలను నిర్వహించడంపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో అనుభవం ఉన్న నిపుణులతో ఒక వర్క్‌ షాప్‌ నిర్వహించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ వర్క్‌ షాపులో పంచాయతీరాజ్‌ ప్రతినిధులతోపాటు, వివిధ వర్గాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు. తద్వారా వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెరిగి చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలు పెరుగుతాయన్నారు. మరోపక్క ఉపాధి అవకాశాలు వస్తాయని, పర్యావరణానికీ మేలు కలుగుతుందని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img